
రాష్ట్ర ప్రభుత్వం
గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్
ప్రతిగిరిజనుడు సమస్యల సాధనకై పోరాటాలకు సిద్ధం కావాలని……… తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాల్య నాయక్ పిలుపు
వనపర్తి : రాష్ట్రంలోగిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై ప్రతి గిరిజనులు పోరాటాన్ని సిద్ధం కావాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్య నాయక్ పిలుపునిచ్చారు హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి వనపర్తి జిల్లా నుండి సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరై ఈ సమావేశము ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజన సమస్యలను పరిష్కారం చేస్తామని గిరిజనులకు పోడు భూముల సమస్యలు ను పరిష్కారం చేస్తామని గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గిరిజన విద్యార్థులకు ప్రతి మండలంలో ఆశ్రమం పాఠశాల ఏర్పాటు గిరిజనుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తామని వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వ 19 నెలలు గడిచినప్పటికీ గ గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు అమ్ములు చేయలేక పోయారు గిరిజనులకు ఇచ్చిన హామీని అమ్ములు చేయలేకపోయారు గిరిజనులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాలతో పాటు విద్య వైద్యం ఇండ్లు పింఛన్ రేషన్ కార్డు రాజీవ్ వికాస్ పథకంలో దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి గిరిజనులకు ఈ పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాన్ని వారు ప్రవేశపెట్టారు ఈ తీర్మానం ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ ఆమోదించింది ఈ సమస్య పరిష్కారం కోసం జూన్ 20 నుండి దశల వారి పోరాటాన్ని కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు
