
నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!
వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది..
ఈ లీగ్ దశ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, ప్లేఆఫ్స్లో దాని స్థానం పదిలం అవు తుంది. కానీ, ఈ సీజన్లో సొంత మైదానంలో అత్య ధిక మ్యాచ్ల్లో ఓడిపోయిన ఆర్సీబీకి, అదే మైదానంలో కేకేఆర్తో జరిగిన పేలవమైన రికార్డు మరో తలనొప్పిగా మారింది.
నిజానికి, 2015 నుంచి ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా చేతిలో వరుసగా ఓడిపోతూనే ఉంది. అంటే, శనివారం ప్లేఆఫ్కు చేరుకోవాలంటే ఆర్సీబీ 10 సంవత్సరాల చరిత్రను మార్చాల్సి ఉంటుంది.
చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన బాగాలేదు. ఈ మైదానంలో ఆడిన చివరి 5 మ్యాచ్ల్లో కోల్కతా ఆర్సీ బీపై విజయం సాధించింది. 2015 తర్వాత ఆర్సీబీ వారి సొంత గడ్డపై ఒక్కసారి కూడా కేకేఆర్ను ఓడించలేకపోయింది.
అదే సమయంలో, ఈ మైదానంలో రెండు జట్ల మొత్తం రికార్డు గురించి మాట్లాడుకుంటే, ఆర్సీబీ ఇక్కడ కూడా వెనుకబడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరగగా, బెంగ ళూరు కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. కోల్కతా 8 మ్యాచ్ల్లో గెలిచింది.
అంతేకాకుండా, ఐపీఎల్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరిగాయి. ఇందులో కూడా ఆర్సీబీ ప్రదర్శన నిరాశ పరిచింది. ఆర్సీబీ కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లలో 15 గెలిచి, 20 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే, ఈ సీజన్లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ అనేక పాత రికార్డులను బద్దలు కొట్టింది.
అది 17 సంవత్సరాల తర్వాత చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 10 సంవత్సరాల తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్ జట్టును ఓడించగలిగింది. ఆర్సీబీ ఇప్పుడు కోల్కతాపై కూడా అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది.
