
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి , GHMC ఇంజనీరింగ్ విభాగం, అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషి తో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించడం జరిగింది .
పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని,అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,
రోడ్లు, డ్రైనేజి, మంచినీటి వసతి, విధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలని అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయాలని తెలియచేశారు.అంతర్గత రోడ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని, కాలనీలలో పూర్తి స్థాయిలో రోడ్ల ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
రాబోయే వర్షాకాలం లోపు నాలల విస్తరణ పనులను వేగవంతం చేయాలని , పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాకాలం లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాలల పూడికతీత పనులు వేగవంతం చేయాలని, వర్షాకాలంలోపు నాలలలో పేరుకుపోయిన చెత్త చెదారం ను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వర్షాకాలంలో వచ్చే లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.
ప్రజఅవసరాల దృష్ట్యా లింక్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని,కూడలి ల సుందరి కరణ చేపట్టాలని, చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రహిత సమాజం కోసం ట్రాఫిక్ మెరుగుదల పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఫూట్ పాత్ ల అక్రమాలను తొలగించాలని, ఫూట్ ఫాత్ ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాటసారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని , ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండి,క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని, అన్ని కాలనీ లను సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని, కాలనీ లలో చేపడుతున్న పనులలో వేగం పెంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GKD ప్రసాద్, EE ఇంద్ర బాయి ,DE దుర్గ ప్రసాద్, DE విశాలాక్షి,DE శ్రీదేవి, AE జగదీష్, AE ప్రశాంత్, AE రషీద్, AE ప్రతాప్, AE సంతోష్ ,AE సంతోష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
