TEJA NEWS

శంకర్ పల్లి మండలంలో హడలెత్తిస్తున్న వరుస దొంగతనాలు

మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలను దోచుకుంటున్న దొంగలు

ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న స్థానికులు

*శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ మరియు మండల పరిధిలో వలస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా శంకర్ పల్లి కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల బాలాజీ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో రెండు నెలల కిందట దుకాణ షట్టర్ ను పైకి లేపి ప్రవేశించిన దొంగలు కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లిన సంఘటన మరువక ముందే నిన్న అనగా గురువారం రోజున ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో బాలాజీ ఎలక్ట్రానిక్స్ పక్కనే గల శివం ప్లైవుడ్ మరియు హార్డ్వేర్ దుకాణంలో మరో మారు చోరీ జరగడం విడ్డూరం.

రెండు నెలల వ్యవధిలో ఒకే మున్సిపాలిటీ పరిధిలో అది అదే హైదరాబాద్ రోడ్డులో పక్కపక్కనే ఉన్న దుకాణాలలో చోరీ జరగడంతో ఇటు మున్సిపల్ ప్రజలు మరియు స్థానికులు అందులో ఉన్న వ్యక్తం చేస్తున్నారు. మండల పరంగా చూసుకుంటే రెండు నెలల వ్యవధిలో ఈ రెండు దొంగతనాలు కాకుండా మండల పరిధిలోని మోకిలా గ్రామంలో గల మొబైల్ షాప్ లో గత 15 రోజుల కింద దొంగలు పడ్డారు. ఆ మొబైల్ షాప్ లో పడ్డ దొంగలను మోకిలా పోలీసులు గుర్తించి, వారిని పట్టుకుని వసంతం రికవర్ చేయడం జరిగింది. కానీ శంకర్ పల్లి పోలీసులు ఇప్పటి వరకు రెండు నెలల కింద జరిగిన బాలాజీ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసు నిందితులను పట్టుకోకపోవడంతో, మరో మారు పక్కనే ఉన్న శివం ప్లైవుడ్ దుకాణంలో చోరీ జరిగిందని స్థానికులు గుస గుసలాడుతున్నారు.


TEJA NEWS