TEJA NEWS

ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను…. మోతుకుపల్లి మహిపాల్ యాదవ్.

శంకరపల్లి : కాంగ్రెస్ పార్టీ యూత్ ఎన్నికలలో శంకరపల్లి మండల పరిది కొండకల్ గ్రామానికి చెందిన మోతుకుపల్లి మహిపాల్ యాదవ్ చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనని ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలందరికి అందుబాటులో ఉండి పార్టీ కోసం కృషి చేస్తానన్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ఈ నెల 10 తేదీ నుండి సెప్టెంబర్ 10 వరకు జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు తనని గెలిపిస్తే ఎల్లవేళల ప్రజల సమస్యలను తెలుసుకొని అందరికీ అండగా ఉంటానని అన్నారు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రోత్సహించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కొనియాడారు.


TEJA NEWS