TEJA NEWS

నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా – కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్
పేద ప్రజల కోసం ఏర్పడ్డదే కాంగ్రెస్ పార్టీ
ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి

కమలాపూర్ :
ప్రజల కష్టాలను తీర్చడం లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వైపే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. కమలాపూర్ మండల పరిధిలోని భీంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి లక్ష్మి అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్ లోనీ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొంది కోలుకొని ఇంటికి రాగ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ కావటం వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకుడు వాసాల శ్రీనివాస్ కు చెప్పగా కాంగ్రెస్ నాయకుడు వాసాల శ్రీనివాస్ హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ను కలిపించి హాస్పిటల్ బిల్లుల విషయం తెలుపగా అందుకు స్పందించిన ప్రణవ్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి అరవై వేల రూపాయలను మంజూరు చేయించి తాళ్లపల్లి లక్ష్మి కొడుకు తాళ్లపల్లి కుమారస్వామి కి చెక్కు ను అందించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్ష పాతి అని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతుందని ప్రజా సంక్షేమానికి తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజక వర్గం లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా తాను అందుబాటు లో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండలానికి చెందిన ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కు లు పొందిన కుటుంబ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల మాజి అధ్యక్షులు డా.గుండారపు చరణ్ పటేల్, నాయకులు డా. మౌటం కుమారస్వామి, వాసాల శ్రీనివాస్, కెత్తె రవి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS