TEJA NEWS

శాశ్వతమైన రెవిన్యూ అధికారిని నియమించండి.
కలెక్టర్ కి ప్రజావాణిలో సీపీఐ వినతి
కుత్బుల్లాపూర్ మండలానికి మండల రెవెన్యూ అధికారి లేకపోవడం వల్ల ప్రజలకు కులం,స్థానికత ఇతరత్రా పత్రాలు సకాలంలో లభించడం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ,అలాగే మండలంలోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నాయని కావున వెంటనే ఇంచార్జ్ తో కాకుండా రెగులర్ ఎమ్ ఆర్ ఓ ను నియమించాలని కోరారు.
దీనికి కలెక్టర్ స్పందిస్తూ రెండు రోజుల్లో ఎమ్ ఆర్ ఓ వస్తారని లేనిపక్షంలో కొత్తవారిని నియమిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, శ్రీనివాస్,సహదేవ్ రెడ్డి,ఇమామ్,ప్రభాకర్ లు పాల్గొన్నారు.

TEJA NEWS