TEJA NEWS

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటి వరకు SECగా బాధ్యతలు నిర్వర్తించిన పార్థసారధి పదవీకాలం ముగిసింది. దీంతో రాణి కుముదిని పేరును తెలంగాణ ప్రభుత్వం సూచించగా, గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల పాటు ఆమె SECగా కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఐఏఎస్‌గా సేవలందించిన ఆమె 2023లో పదవీ విరమణ చేశారు.


TEJA NEWS