TEJA NEWS

నిజామాబాద్ లో గుండెపోటుతో ఏఎస్ఐ మృతి?

నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు న్న ఏఎస్ఐ దత్తాద్రి (56)ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్ లో నివాసం ఉంటున్న ఏఎస్ఐ దిన చర్యలో భాగంగా ఉదయం 6 గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తుండగా ఈ క్రమంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై ఒక్క సారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.అంతకు ముందు ఏఎస్ఐ దత్తాద్రి బోధన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు.

పదోన్నతి లో భాగంగా 2 సంవత్సరాలుగా నిజామాబాద్ ఒకటవ టౌన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. ఏఎస్ఐ మృతి విషయం తెలుసు కున్న తోటి పోలీస్ సిబ్బంది షాక్ కు గురయ్యారు.


TEJA NEWS