హైదరాబాద్: అటల్ బిహారీ వాజ్పేయీ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కావ్య కిషన్ రెడ్డి హైటెక్స్లో దీప్మేళా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తారని దీప్ మేళా అధ్యక్షురాలు రాధిక మలానీ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 200 పైగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారని, దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకృతులు, దుస్తులు, ఇతర గృహోపకరణాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయన్నారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయంతో దీపిక్షా మహిళా క్లబ్ సొంతంగా పాఠశాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. 1987 నుంచి దీపిక్షా మహిళా క్లబ్ కన్యక గురుకుల్ హై స్కూల్ను నిర్వహిస్తోంది. దీపిక్షా మహిళా క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలానీ మాట్లాడుతూ క్లబ్ సభ్యుల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ మేళా జరగుతుందని తెలిపారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారకు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మేళా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
అటల్ బిహారీ వాజ్పేయీ ఫౌండేషన్ ఛైర్పర్సన్ కావ్య కిషన్ రెడ్డి
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
TEJA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
TEJA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ…