TEJA NEWS

ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు

  • సీఐ మల్లికార్జునరావు పరవాడ

పరవాడ సిఐ మల్లికార్జున రావు డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు.మండల కేంద్రంలోని పరవాడ సబ్ స్టేషన్, మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి.రాంకీ ఎస్ ఈ జెడ్ కూడలి.లంకెలపాలెం లో వాహనడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను రహదారి భద్ర నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్ల పైన ఇష్టానుసారంగా వాహనాలనునిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రోడ్ల పైన మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే తొలగించాలని,తొలగించని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని సూచించారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దు అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారణకు సహకరించాలని సిఐ కోరారు.


TEJA NEWS