TEJA NEWS

మిత్ర యూత్ గణేష్ లడ్డూను రూ. లక్ష 11 వేల 111 లకు కైవసం చేసుకున్న సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి

సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లి ఆరవ వార్డు హనుమాన్ మందిరంలో మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను మండల సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి రూ. లక్ష 11 వేల 111 లకు కైవసం చేసుకున్నారు. మిత్ర యూత్ సభ్యులు సొసైటీ చైర్మన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి లడ్డూను అందజేశారు. సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ లడ్డు వేలంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దైవచింతలతోనే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందని సొసైటీ చైర్మన్ తెలియజేశారు. కాలనీవాసులు పాల్గొన్నారు


TEJA NEWS