TEJA NEWS

ఎం ఎస్ ఎం ఈ, పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:
తెలంగాణలో పారిశ్రామి కాభివృద్ధి అంశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ, పాలసీని బుధవారం ఉదయం మాదాపూర్ లోని శిల్పకళ వేదికగా ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు..

బుధవారం ఉదయం 11గంటలకు ఎంఎస్ఎంఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభించగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా పరిశ్రమల అవసరాలు, అభిరుచులకు అనుగు ణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తా మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

అమెరికాలో ఉన్న వ్యాపారావకాశాలన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబో తున్నామని ప్రకటించారు.


TEJA NEWS