Sep 8, 2024
హైదరాబాద్: రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలు గా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్ట్లు హద్దులు దాటి వ్యవహారించకూడదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు, కొన్ని పత్రికలు చాలా చిల్లర రాతలు రాస్తున్నారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.
విలువలు దాటితే మేము దాటుతాం..
‘‘ కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్ను చిప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి అయిన విలువ ఇవ్వాలి. ఎదుటి వాళ్లు విలువలు దాటితే మేము దాటుతాం. అక్రిడిడేషన్ విషయంలో ఈసారి కచ్చితంగా నిబంధనలు ఉంటాయి. జర్నలిస్ట్లకు పార్లమెంటరి పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిట్చాట్లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్లో సన్నిహితంగా మాట్లాడిన మాట్లలను రికార్డు చేసిన సందర్భలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు’’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..
సమాజంలో జర్నలిస్ట్ల సమస్యలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనాడే గుర్తించారని తెలిపారు. 11 వందల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సంతోషమని చెప్పారు. జర్నలిస్ట్ల సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది బాధ్యతగా వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్ర విభజన లాంటి అంశాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు తమ ప్రభుత్వంలో పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాలపై సరైన అభిప్రాయం లేదు..
ఫైళ్లు తెప్పించుకునే సాంస్కృతి తమ విదానం కాదని చెప్పారు. అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అని వివరించారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న దాని పరిష్కారానికి మాత్రమే తాము పని చేస్తామని అన్నారు. వృత్తి పరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలని అన్నారు. రాజకీయాలపై సరైన అభిప్రాయం ప్రజల్లో లేదని చెప్పారు. రాజకీయాలు అన్న రాజకీయ నాయకులు అన్న ప్రజల్లో చిన్న చూపు ఉందని తెలిపారు. కేవలం కుటుంభ సభ్యుల కోసం పని చేస్తారనే అపవాదు ఉందని అన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లే అవకాశం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లే అంశం దేవుడేరుగు అని విమర్శించారు.
గతంలో సెక్రెటరీయేట్కు వెళ్లే పరిస్థితి లేదు..
సిద్ధాంత పరమైన అంశాల కోసం మాత్రమే అప్పట్లో రాజకీయ పార్టీలు, పత్రికలు పెట్టుకున్నాయని చెప్పారు. దీనికి నిదర్శనం కమ్యూనిస్టులు పార్టీలని తెలిపారు. గతంలో సెక్రెటరీయేట్కు ప్రజా ప్రతినిధులు తాము వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఈరోజు జర్నలిస్ట్ లు సైతం సచివాలయంలోకి వెళ్లవచ్చని అన్నారు.
రాద్ధాంతం సృష్టిస్తున్నారు..
కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు సెక్రెటరీయేట్లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి జర్నలిస్ట్లకు విలువ లేదని స్పష్టం చేశారు. ఎవరిని చూసిన తాము యూట్యూబ్ అంటున్నారని. కొందరు ఇంకేదో అంటున్నారని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.