ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష
*వనపర్తి :
వనపర్తి జిల్లా ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో దీక్షను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రస్థాపక అధ్యక్షుడు గంధం సుమన్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కావడంతో వివిధ అవసరాల కోసం జిల్లా కేంద్రానికి ప్రతినిత్యం పేదలు ఉదయం వచ్చి సాయంకాలంవెళ్తుంటారని ఈ క్రమంలో వందల రూపాయలు వెచ్చించి హోటల్లో భోజనం చేసే స్తోమత లేని నిరుపేదలు ఖాళీ కడుపులతో తిరిగి వారి గ్రామాలకు వెళుతుంటారని ఈ పరిస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని పలు కూడళ్ళలో భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోపలుచోట్ల ఐదు రూపాయల భోజన పథకం నడుస్తున్నదని ఇక్కడ కూడా త్వరగా ప్రారంభిస్తే నిరుపేదల ఆకలిని తీర్చడం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బండి అజయ్ మాదిగ శరత్ చంద్ర దాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…