TEJA NEWS

వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు

హైదరాబాద్:
వీఆర్వో వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది,మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకు నేందుకు కసరత్తు ప్రారంభించింది.

రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డీ, మీడియా ప్రతినిధులతో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభు త్వం వీఆర్వో వ్యవస్థను ధ్వంసం చేసిందని,అందుకే వీఆర్‌వో వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నా మని,వెల్లడించారు.

మళ్లీ వారిని వీధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారులు నియమిస్తామని, తెలిపారు.ధరణి పోర్టల్ పేరును కూడా మార్చుతు న్నారని కీలక ప్రకటన చేశారు.

ధరణి పేరుతో ఇష్టాను సారం దోచుకున్నవారిని తప్పకుండా జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.


TEJA NEWS