TEJA NEWS

ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువు పెంపు

హైదరాబాద్‌:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీ డియట్‌ బోర్డు అధికారులు తెలిపారు.శుక్రవారం సాయంత్రం తెలిపింది.

2024- 25 విద్యా సంవత్స రానికిగాను ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, కో-ఆప రేటివ్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, కాంపోజిట్‌ డిగ్రీ, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది.

ఈ గడువులోగా విద్యార్థు లకు ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఇంటర్మీడియట్‌ బోర్డు అనుబంధ అఫిలియేటెడ్‌, కళాశాలల్లోనే చేరాలని విద్యార్థులకు సూచించింది.

అనుబంధ కళాశాలల జాబితా ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉందని తెలిపింది..


TEJA NEWS