TEJA NEWS

బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన కేఎన్ఆర్

విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పంతులు మేడ బిజెపి కార్యాలయం నుండి విశాఖ వినాశ్రయంకి బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో కార్ల ర్యాలీగా వెల్లారు. కేంద్ర బారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకి, రాష్టృ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లకు స్వాగతం పలకడానికి ర్యాలీగా బయలుదేరి వెల్లిన కార్లకు ప్రచార రధంకి నరసింగరావు జెండా వూపి ప్రారంభంచారు. ఈ సందర్బంగ నరసింగరావు మాట్లాడుతూ కూటమిలో బిజెపి తరపున గెలుపొందిన బిజెపి కేంధ్ర బారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాసవర్మకి , రాష్టృ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఎంపిలకు ఎం.ఎల్ఏ లకు విశాఖ పోర్టు సాగరమాల ఫంక్షన్ హాల్ లో అభినందన సభ ఏర్పాటు చేసారని అన్నారు అందులో బాగంగా విమానాశ్రయంకి వెల్లి మంత్రులకు స్వాగతం పలికామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సోంబాబు,యల్లాజీరావు,శంకరరావు,శ్రీదేవి,నాగేశ్వరావు,పేర్ల.అప్పారావు, తాతారావు,ముసలయ్య,దిలీప్,జగదీష్,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS