TEJA NEWS

దూలపల్లి లో పచ్చదనం – స్వచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, దూలపల్లి 14 వ వార్డులో కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పచ్చదనం – స్వచ్చదనం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ శ్రీహరి , మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ , నాయకులు గడ్డం ప్రసాద్ గారు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS