
గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు
మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు.
ప్రభుత్వం తనను అవమానిస్తోందని, అందుకు పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు.
మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ తీసేశారని మండిపడ్డారు.
స్టాండింగ్ కమిటీ సమావేశo సమాచారం ఇవ్వలేదనటి, ఇటువంటి అవమానం ఎన్నడూ జరగలేదని మనోహర్ అసహనం వ్యక్తం చేశారు.
