TEJA NEWS

తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy ని ఎం.ఏ.ఫహీమ్ మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సహకరించిన తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మూన్షి కి, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రి దామోదర్ రాజనర్సింహ ,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో పాటు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ , జిల్లా నాయకత్వం, ఇతర మిత్రులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.


TEJA NEWS