
రూ.5 లక్షలు కట్టాలని KA పాల్ కు హైకోర్టు సూచన
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు నిన్న విచారించింది. ఆ కేసును CBIతో విచారణ జరిపించాలని పిల్ లో పాల్ కోరారు.
ఆ వ్యాజ్యాన్ని ఆయన సదుద్దేశంతోనే దాఖలు చేశారన్న రుజువు కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద రూ. 5లక్షలు కట్టాలని సూచించింది.
ఆ సొమ్ము చెల్లించిన తర్వాతే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
