TEJA NEWS

శంకర్‌పల్లిలో ఒకే మొక్కకు 15 బ్రహ్మ కమలాలు.. ప్రత్యేకతలివే, చూసేందుకు వస్తున్న జనం

శంకర్‌పల్లి: బ్రహ్మ కమలం ఒక పువ్వు పూసిందంటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక బ్రహ్మకమలం మొక్కకి ఏకంగా పదుల సంఖ్యలో పుష్పాలు
పూయడం నిజంగా అద్భుతం. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు గండేటి శ్రీరాములు గౌడ్, స్వరూప ఇంట్లో బ్రహ్మ
కమలం ఏకంగా 15 పుష్పాలు వికసించాయి. ఒకేసారి 15 పుష్పాలు పూయడంపై ఇంటి యజమాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో
బ్రహ్మ కమలాలు పూస్తాయని అనుకోలేదన్నారు.

ఇన్ని పుష్పాలు ఒక్కసారే పూయడంతో చుట్టుప్రక్కల వారు చూడటానికి ఆసక్తి చూపించారు. వికసించిన పుష్పాలను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. తాను ఎంతో ఇష్టంతో పెంచుకున్న బ్రహ్మకమలం మొక్క ఒక్కసారిగా 15 పుష్పాలు వికసించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి బ్రహ్మ కమలాలు విరబూస్తున్నాయి. కానీ ఏకంగా 15 పుష్పాలు పూయడం చర్చనీయాంశమైంది.

బ్రహ్మ కమలం శివునికి అత్యంత ప్రీతికరమైనది భక్తుల విశ్వాసం. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ కొన్ని మొక్కలకు మాత్రమే ఇలా భారీ పుష్పాలు వికసిస్తాయి అంటున్నారు.


TEJA NEWS