TEJA NEWS

రామకోటికి భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారం
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన రామకోటి
ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ పురస్కారం పొందిన శుభ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి రామకోటి రామరాజుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నేడు జాతీయ స్థాయిలో భక్తిరత్న పురస్కారం పొంది నేడు తెలంగాణకే భక్తి రంగంలో ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. రామ నామమే ప్రాణమని గత 25 సంవత్సరాలనుండి నిర్వీరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి లిఖింపజేస్తూ వారికి ఆధ్యాత్మి మార్గాన్ని చూపిస్తూ భక్తిరత్న పురస్కారం పొందడం రామకోటి రామరాజుకే దక్కిందన్నారు. మరెన్నో పురస్కారాలు పొందాలని కోరారు.


TEJA NEWS