TEJA NEWS

జత్వానీ కేసు.. ఐపీఎస్‌ కాంతిరాణా, విశాల్‌ గున్నీకి ఊరట

సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్‌ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.