TEJA NEWS

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ
రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ. 50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడునెలలకోసారి జ్లిలా ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. విడుదలయ్యే ఖైదీల్లో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. విడుదలయ్యే ఖైదీలను ఆయా జైళ్ల నుంచి చర్లపల్లి కేంద్ర కారాగానికి తరలించనున్నారు.


TEJA NEWS