గవర్నర్ ను కలిసిన ఖమ్మం ఎంపీ
జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరిన రఘురాం రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్థూపం, కూసుమంచి లో కాకతీయులు నిర్మించిన శైవాలయం.. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానంతో పాటు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సింగరేణి, పలు కేంద్రీయ పరిశ్రమలు, ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. తమరు రాష్ట్ర గవర్నర్ గా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే.. మరింత ప్రాచుర్యం లభిస్తుందని, వీలైనంత త్వరగా రావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందిస్తూ.. తప్పకుండా వీలైనంత త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తానని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి మాటిచ్చారు. ఎంపీ స్పందిస్తూ.. గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ ను కలిసిన ఖమ్మం ఎంపీ
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…