TEJA NEWS

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి :
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

అధికారులు, ప్రజాప్రతి నిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలిం చి నివేదిక రూపొందించా లని పేర్కొన్నారు.

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని..అక్కడ అమలు చేస్తున్నా తీరు, అందులో లోటుపాట్లను పరిశీలించాలన్నారు.

కొంత ఆలస్యమైనా.. ఇందులో ఎటువంటి లోపాలకూ తావులేకుండా, మహిళలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా విధానా లను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


TEJA NEWS