TEJA NEWS

గోకులం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీవి..

ఈపూరు మండలం బోడిశంభుని వారిపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గోకులం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పశువుల సంరక్షణకు ప్రభుత్వం మినీ గోకులం పథకం ద్వారా రాయితీపై పాడి రైతులకు పశువుల షెడ్లు నిర్మాణానికి నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు గారు, MNREGS అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS