TEJA NEWS

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (పైడూరుపాడు),

విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

గ్రామాల్లో శుభ్రత పరిశుభ్రతపై స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆదేశించారు.

ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమాన్ని కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలన్నారు.

గ్రామాల్లో మురుగునీటి కాలువల శుభ్రత, ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్ధాలపైన బహిరంగ మలమూత్ర విసర్జనపైన అవగాహన కల్పించాలన్నారు.

స్వచ్ఛభారత్ దినోత్సవం ప్రజల భాగస్వామ్యంతో వేడుకగా జరగాలన్నారు. శ్రమదానాలు కూడా నిర్వహించి ప్రతి ప్రాంతాన్ని శుభ్రపరచాలన్నారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించాలని అన్నారు.

ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS