TEJA NEWS

రాజానగరంలో రసాభాసగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ

రాజానగరం, :
రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు రాజానగరంలో రసాభాసగా జరిగింది. జనసేన, బిజెపి, మహిళలలు అరుపులు కేకలు మధ్య ముగిసింది. గ్రామంలో సాయిబాబా గుడి ప్రక్కన జగనన్న కాలనీలో విద్యుత్ సమస్యపై కాలనీలో నివాసం ఉంటున్న మహిళలకు జనసేన వీరమహిళలకు వివాదం మెదలైంది. విద్యుత్ ఇవ్వాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఇల్లు పట్టాలు ఇచ్చేముందు విద్యుత్ ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో ఉన్నవారికి తెలియలేదా అని ప్రశ్నించారు. ఇలా ఒకరిపై మరోకరు అరుపులు, కేకలు వేసుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి నాయకులను సర్ది చెప్పన తర్వాత సభ కొనసాగింది.


TEJA NEWS