Spread the love

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని కలుసున్నారు. అనంతరం పిచాయ్ తన Xలో ఓ పోస్టు పెట్టారు. ‘మోదీని కలవడం ఆనందంగా ఉంది. భారతదేశానికి AI అందించే అద్భుతమైన అవకాశాల గురించి, భారత్ డిజిటల్ పరివర్తనపై కలిసి పని చేసే మార్గాల గురించి మేము చర్చించాము.’ అని ట్వీట్ చేశారు.