ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి
వనపర్తి
వనపర్తి జిల్లా
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు.
ఉదయం వనపర్తి జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్ర చికిత్సల వార్డు, ఎస్ ఎన్.సి. యు వార్డులను పరిశీలించారు.
ఆసుపత్రిలో ఉన్న బెడ్ ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్లను పరిశీలించారు. రోజుకు ఎన్ని ఒ.పి లు నమోదు అవుతున్నాయి, ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకు రేఫర్ చేసిన రిజిస్టరును పరిశీలించారు.
24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలసి, ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్.యం.ఒ
డా. బంగారయ్య, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డా. అరుణ కుమారి, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…