పింఛన్లు పంపిణి
-కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం :
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోగల 95 సచివాలయముల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను సంబంధిత సచివాలయ కార్యదర్శుల ద్వారా లబ్దిదారులకు అందచేయుడం జరుగుతుందని రాజమహేంద్రవరం కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్షన్ పంపిణి కార్యక్రమం ప్రతినెల 1న ఇవ్వాల్సి ఉండగా ఈనెల 1న ఆదివారం సెలవు దినం రావడం వల్ల ఈనెల 31నే (ముందురోజు)శనివారం ఉదయం 5గంటల నుండి పించను దార్లక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరికైనా అందని పక్షంలో, తీసుకోలేని క్రమంలో 2వ తేదీన ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశముల మేరకు పెన్షన్లు పంపిణి చేసి లబ్దిదారులకు నగదు రశీదులు అందించబడును. కావున పెన్షన్ దారులు తమ పెన్షన్ కొరకు సచివాలయములకు రానవసరం లేదని తెలియజేయడమైనది.
పింఛన్లు పంపిణి-కమిషనర్ కేతన్ గార్గ్
Related Posts
గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవం
TEJA NEWS గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవంవిగ్రహందాత – బలిరెడ్డి అప్పారావు కుమారుడు బలిరెడ్డిబాలరాజు & శ్రీదేవి దంపతులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గండివానిపాలెం గ్రామప్రజలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా…
సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశం
TEJA NEWS సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశంముఖ్య అతిథులుగా:- సీఈఓ మౌతిక… అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ ఐదు వసంతాల పూర్తి చేసుకుని ఆరువ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల…