TEJA NEWS

గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు.

నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా కాలనీలో అపరిచితుల పట్ల అప్రమ త్తంగా ఉండాలని, కాలనీ వాసులను కోరారు.

దీనిలో భాగంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్ తో తనిఖీ లు చేపట్టామని ఏసిపి తెలిపారు…

గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

TEJA NEWS