మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం రెవెన్యూ లోని పెద మొల్లోడు గెడ్డ పరివాహక ప్రాంతం లోని ఆక్రమణను రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తొలగించారు.51 సర్వే నెంబర్ లోని గెడ్డ స్థలం సుమారు 30 సెంట్లు వరకూ ఆక్రమించి ఓ భూ కబ్జాదారుడు గెడ్డను కబ్జా చేసాడు. ఏకంగా గెడ్డను కప్పేసి పక్కనున్న తన సొంత భూమిలో కలుపుకున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రెండ్రోజుల క్రితం సర్వేయర్తో సర్వేయించి గెడ్డ ఆక్రమణకు గురయినట్లు గుర్తించారు. ఈ మేరకు జెసిబిని తీసుకెళ్లి ఆక్రమణను తొలగించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అక్రమదారుని పై అధికారులు ల్యాండ్ గ్రాభింగ్ కేసు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.
Related Posts
గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవం
TEJA NEWS గండివానిపాలెం లో ఘనంగా శ్రీ దుర్గాదేవి రాట మహోత్సవంవిగ్రహందాత – బలిరెడ్డి అప్పారావు కుమారుడు బలిరెడ్డిబాలరాజు & శ్రీదేవి దంపతులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గండివానిపాలెం గ్రామప్రజలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా…
సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశం
TEJA NEWS సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల 5వ మహజన సమావేశంముఖ్య అతిథులుగా:- సీఈఓ మౌతిక… అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ ఐదు వసంతాల పూర్తి చేసుకుని ఆరువ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సంకల్పఫల రైతు ఉత్పత్తి దారుల…