TEJA NEWS

పోరాడి ఓడిన రీతిక

హైదరాబాద్:
పారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలయ్యా రు. టాప్-సీడ్ అయిపెరి మెడెట్ కైజీ చేతిలో ఆమె పోరాడి ఓడారు.

ఇరువురు రెజ్లర్లూ 1-1 స్కోరుతో సమానంగా ఉన్నప్పటికీ టెక్నికల్‌గా మెడెట్ కైజీ పైచేయి సాధించారు. దీంతో మెడెట్ కైజీని అంపైర్లు విజేతగా ప్రకటించారు.

ఇక మెడెట్ కైజీ ఫైనల్ చేరితే రెపెచేజ్ విభాగంలో రీతికా హుడా కాంస్య పతక పోరుకు అర్హత సాధించ నున్నారు…


TEJA NEWS