TEJA NEWS

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్లోక అకాడమీ ఐఐటి మెడికల్ లో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిందని శ్లోక అకాడమీ కరస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం జాతీయస్థాయి ఐఐటి, మెడికల్ లో ర్యాంకులు సాధించిన పి. శంకర్ (96.47) బి. శివాని (95.83) ఏ యక్షేంద్ర కుమార్ (94.40) లు పర్సంటేజ్ సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటీ మెడికల్ అకాడమీలో 36 మంది విద్యార్థులు హాజరు కాగా 20 మంది విద్యార్థులు విజయం సాధించడంతోపాటు అడ్వాన్సుడు కు అర్హత సాధించారని తెలిపారు. ఇట్టి విజయానికి కారకులైన తల్లిదండ్రులు విద్యార్థులు, అధ్యాపకలు కళాశాల సిబ్బంది నీ అభినందించారు


TEJA NEWS