TEJA NEWS

శ్రీ నడిగడ్డ నాగుల ఎల్లమ్మ నూతన విగ్రహ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపెట్ ఇందిరమ్మ కాలనీలోని శ్రీ నడిగడ్డ నాగుల ఎల్లమ్మ నూతన విగ్రహ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ అందరిపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, 20వ వార్డు ప్రెసిడెంట్ కామేష్, నాయకులు లక్ష్మణ్, బాబీ, దుర్గా ప్రసాద్, పవన్, పిచ్చేశ్వర్ రావు, మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS