TEJA NEWS

ప్రజా సంక్షేమంలో పాలుపంచుకుంటా — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజల సంక్షేమంలో తోడ్పడతానన్నారు..

— ఈరోజు పలు సమస్యలపై వచ్చిన నియోజకవర్గం ప్రజల స్థానిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…