TEJA NEWS

అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు

కరీంనగర్ – చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పోస్టు కార్డులు రాసి ప్రదర్శించారు.

450 మంది విద్యార్థులకుగాను కేవలం రెండే బస్సులు నడిస్పిస్తున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.


TEJA NEWS