విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ ఉంచాలని అధికారుల కు సూచించిన ……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి :
విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు.
మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల, కే.జి.బి.వి ల్లో కమిటీ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు నిఘా పెట్టాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా మత్తు పదార్థాలను గుర్తించి శునకాలతో తనిఖీ చేయించాలని పోలీస్ శాఖను సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు ఉన్న గంజాయి సాగు కేసులపై వివరాలు అడిగారు.
ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఉత్పత్తి కానీ వాడకం కానీ జరిగినట్లు తెలిస్తే 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి అనర్తాల పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం . నగేష్, ఆర్డీఓ పద్మావతి, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు నాయక్, విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, సంక్షేమ శాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…