
సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బడుగుల
కృష్ణ నీళ్లు ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న కళ్ళున్న కబోధిలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కె ఆర్ ఎం బి కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు
తెలంగాణను ఎడారిగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారధ్యంలో సూర్యాపేట జిల్లా నుంచి జల పోరాటం మొదలవుతుంది
మాజీ రాజ్యసభ సభ్యులు , సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు
కృష్ణానది నీటిని అక్రమంగా ఆంధ్రకు తరలిస్తున్నా అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కండ్లున్న కబోదిలా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ కు వెయ్యి టీఎంసీల నీరు వస్తే అందులో 60% ఆంధ్ర, 40% తెలంగాణ వాడుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పదివేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రకు దొంగతనంగా తరలించారని అన్నారు. వాళ్లకు రావాల్సిన నీటినే కాకుండా ఇంకా అక్రమంగా నీటిని తరలిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లు నోరు మెదపకపోవడం మన దౌర్భాగ్యమన్నారు. మా నాయకులు హరీష్ రావు కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్నారని కేఆర్ఎంబి వద్ద ధర్నా చేస్తామని, ఢిల్లీకి వెళ్తామని హెచ్చరించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కృష్ణ నదిపై తుంగభద్ర, నావలి రెండు చెక్ డ్యామ్లు తయారు చేసేందుకు ఆంధ్ర తిరుగుతున్నా ఆ ప్రాజెక్టులు కట్టవద్దని కె ఆర్ ఎం బి కి పోయి చెప్పిన దాఖలాలు లేవన్నారు. బిజెపికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న, కేంద్ర మంత్రులుగా బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఉన్న ఈ విషయమై స్పందించలేదని తెలంగాణ వాటా ప్రకారం కృష్ణా జలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి రెండుసార్లు నీళ్లు ఇచ్చామని, లిఫ్టుల ద్వారా లక్ష ఎకరాలకు, నాగార్జునసాగర్ ద్వారా 4:30 లక్షల ఎకరాలకు ఎస్ఎల్బీసీ ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని భవిష్యత్తులో సూర్యాపేట నల్లగొండ హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు తాగునీటికీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నాగార్జునసాగర్ వద్ద కేంద్ర బలగాలను తొలగించాలని శ్రీశైలం వద్ద ఆంధ్ర బలగాలు ఉంటే నాగార్జునసాగర్ వద్ద కేంద్ర బలగాలను ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సన్నాయి నొక్కులకు మాయమాటలకు రేవంత్ రెడ్డి లొంగిపోయి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి సారధ్యంలో సూర్యాపేట జిల్లా నుంచి జల పోరాటం మొదలవుతుందన్నారుకృష్ణాజిల్లాల అక్రమ తరలింపు పై ఢిల్లీకి వెళ్లి కేఆర్ఎంబిని ప్రశ్నించేందుకు మేము వస్తామని మీరు వస్తె కలసి పోరాడుదామన్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి ఆంధ్రకు పోయే నీటిని ఆపాలన్నారు. ఎస్సారెస్పీ రెండవ దశ ద్వారా ఆరేండ్లు నీళ్లు ఇచ్చామని ప్రస్తుతం నీళ్లు ఇవ్వకపోవడంతో తుంగతుర్తి సూర్యాపేట మునగాల లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కృష్ణ జలాలు ఆంధ్రకు అక్రమ తరలింపును అడ్డుకోవడం తో పాటు రైతుల పంటలకు సకాలంలో నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు తూడి నరసింహారావు తదితరులు ఉన్నారు.
