ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలి
లంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు దూరంగా ఉండాలి – జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి .
దరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలని రోజుకు కనీసం 15 దరఖాస్తులు పరిష్కరించి దస్త్రాలు తనకు పంపించాలని ఆదేశించారు.
. ఉదయం వనపర్తి కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో తహశీల్దార్లు, ఆర్డీఓ తో ధరణి దరఖాస్తుల పరిష్కారం పై వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ఇలాంటివి తన దృష్టికి వస్తె కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారులు వరుసగా ఏ.డి బి. దాడుల్లో పట్టుబడటం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలో ఏ ఒక్క అధికారి లంచం తీసుకోవడం లేదా ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. దానివల్ల లంచం తీసుకునే ఉద్యోగి జైలు కు వెళ్ళడమే కాకుండా వారి కుటుంబం వీధిన పడుతుందన్నారు.
ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో వేగం పెంచాలని పెండింగ్ మ్యూటేశన్, సక్షేశన్, పాస్ బుక్ లో కరెక్షన్, కోర్టు కేసు సమాచారం వంటి దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీఓ పద్మావతి, తహశీల్దార్లు వెబ్ ఎక్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.
ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలి
Related Posts
మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు
TEJA NEWS మూడవ రోజు అన్నపూర్ణ దేవికి ఘనంగా పూజలు శంకర్పల్లి : దేవీ నవరాత్రులలో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజిస్తారు. కొండకల్ గ్రామం లో అన్నపూర్ణ దేవికి చరణ్ సార్క్ ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యం లో…
కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.
TEJA NEWS కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి. సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు. చేవెళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ…