TEJA NEWS

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా మొదటగా క్యాంపు కార్యాలయంలోనీ విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండల నాయకులతో కలసి గణపతి భజన సంకీర్తనలు నడుమ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా ధర్మపురి గోదావరిలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్,మున్సిపల్,రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు,గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని,లైటింగ్ ను ఏర్పాటు చేయాలని,ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవలని,ప్రజలు భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS