సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం ద్వారా ఆనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్య చికిత్సలో ఆర్థిక భారం

Spread the love

సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం ద్వారా ఆనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్య చికిత్సలో ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుందని – ఎమ్మెల్యే కె. పి.వివేకానంద..

సి.ఎం.ఆర్.ఎఫ్. పథకం ద్వారా మంజూరైన ఎల్.ఓ.సి. చెక్కుల పంపిణీ కార్యక్రమం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుల సమక్షంలో ముగ్గురు లబ్దిదారులకు CMRF నిధుల ద్వారా మంజూరైన రూ.3,50,000/- విలువగల ఎల్.ఓ.సి. చెక్కులను లబ్దిదారుల కుటుంబసభ్యులకు పంపిణీ చేయడం జరిగింది.

లబ్దిదారులు వివరాలు:

  1. శ్రీమతి అమ్తుల్లా తస్లీం , రోడ్డమిస్ట్రీ నగర్ నివాసి – రూ. 2,00,000/- విలువ గల చెక్కు.
  2. శ్రీమతి బేసన్ గౌరి బాయి , గాంధీ నగర్ నివాసి – రూ. 75,000/- విలువ గల చెక్కు.
  3. శ్రీ గుడ్దితి రామాంజనేయులు , ద్వారకా నగర్, చింటల్ నివాసి – రూ. 75,000/- విలువ గల చెక్కు.

ప్రభుత్వ సహాయం అవసరమైన వారికి సకాలంలో అందేలా చూసే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ నిధుల ద్వారా లబ్దిదారులకు వైద్య చికిత్సలో ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలుగుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో 131 డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.ఎం గౌరీష్, 125 డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామి రెడ్డి, ఉద్యమకారుడు కస్తూరి బాలరాజు, సురేందర్ రెడ్డి, కళ్ళెం శ్రీనివాస్ గౌడ్, రంజాన్ పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top