బాచుపల్లి కౌసల్య కాలనీలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ – ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి కౌసల్య కాలనీలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళల సంక్షేమం మరియు సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి కొనసాగుతోందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఆనందం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రామ అధ్యక్షురాలు ఇందిరా కడియాల, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, యశోద ఆర్.పీ. కరుణ, ఆర్.పీ. జ్యోతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి మరియు కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
