
RGK 1-14, సూరారం కాలనీ, 292 డివిజన్, సాయిబాబా నగర్
292 డివిజన్ సాయిబాబా నగర్ పరిధిలోని సూరారం కాలనీ RGK 1 నుండి 14 వరకు నెలకొన్న సమస్యలపై సీనియర్ నాయకులు వారాల వినోద్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది.
స్థానికులకు కలుగుతున్న మౌలిక సదుపాయాల కొరతతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ వైర్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాదయాత్రలో గుర్తించడం జరిగింది.
ఈ సమస్యలన్నింటినీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా ప్రజావాణి ఉండటం వల్ల ఇట్టి సమస్యలపై DC లావణ్య మేడం మరియు విరాట్ కి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలను వివరంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బస్తీవాసులు, మహిళలు తమ సమస్యలపై స్వయంగా మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు: రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, గట్టు అశోక్, భాస్కర్, రాజు యాదవ్, రంగప్ప, బద్రి, వేణు ముదిరాజ్, సత్యనారాయణ గౌడ్, పూర్ణచందర్ రెడ్డి, కిషోర్ ముదిరాజ్, నరసింహ గౌడ్, జై సింహ రెడ్డి, మునీర్, జహీర్, కైసర్ పాషా, మజీద్ పాషా తదితరులు.
ఇట్లు,
వారాల వినోద్ కుమార్
*BRS సీనియర్ నాయకులు, 292 డివిజన్
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
