దిల్లీ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు.. దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని వివరించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
