రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల దిగ్భ్రాంతి

Spread the love

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

శింగనమల నియోజకవర్గము : గార్లదిన్నె మండలం, మర్తాడు గ్రామస్తులు కూడేరు వద్ద జరిగిన ఆటో-కారు ప్రమాదంలో నలుగురి మృతి చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ పేర్కొన్నారు. ఈ ఘటన చాలా తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగడం, క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడం చాలా ఆందోళన కలుగుతుందన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో అతివేగమే కారణమని తెలుస్తుందన్నారు. ఈ విషయం పట్ల ద్విచక్ర వాహనదారుల నుంచి ఆటోలు, ఐచర్ వ్యాన్లు, పెద్ద వాహనాలు, తదితర వాహనాల డ్రైవర్లు ప్రభుత్వం, పోలీసులు పేర్కొన్న సూచనలను పాటించి, ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.

You cannot copy content of this page

Scroll to Top